రెండు లక్షల మందితో బహిరంగ సభ: ఆర్.కృష్ణయ్య
ABN , First Publish Date - 2021-03-06T12:18:47+05:30 IST
బీసీలను పాలకులు యాచకులుగా మార్చివేశారని
హైదరాబాద్/బర్కత్పుర: బీసీలను పాలకులు యాచకులుగా మార్చివేశారని, ఇది ఇక చెల్లదని ‘మేము ఎంతో - మా వాటా కూడా అంతే’ ఇవ్వాలన్న డిమాండ్తో దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. ఈ నెలాఖరున 2లక్షల మందితో నగరంలో బహిరంగసభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం కాచిగూడ మహేంద్రగార్డెన్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.