ఉత్తుత్తి రోడ్డు ఉఫ్....!!
ABN , First Publish Date - 2021-01-25T05:29:50+05:30 IST
ఈ నెల 11వ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వచ్చారు. ఆయన రాకపోకల కోసం పలు ప్రాంతాల్లో రాత్రికి రాత్రి అధికారులు రహదారులకు మరమ్మతులు చేశారు.
సీఎం కోసం హడావిడిగా నిర్మాణం
మూడు రోజులకే బోలెడు గుంతలు
ఈ నెల 11వ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వచ్చారు. ఆయన రాకపోకల కోసం పలు ప్రాంతాల్లో రాత్రికి రాత్రి అధికారులు రహదారులకు మరమ్మతులు చేశారు. ఆ విధంగా రామలింగాపురం అండర్బ్రిడ్జి వద్ద కూడా రోడ్డు వేశారు. అయితే ఆ రహదారి పట్టుమని పది రోజులు కూడా నిలవలేదు. నాసిరకంగా నిర్మించడంతో మూడు రోజులకే గుంతలమయంగా మారింది. అడుగడుగునా గతుకులతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రైల్వే మూడోలైను వంతెన కోసం రెండు నెలల క్రితం ఈ అండర్ బ్రిడ్జి మీదుగా రాకపోకలు నిలిపివేశారు. సుమారు నెల రోజులు వాహనాలను దారి మళ్లించారు. అప్పుడే ఈ రోడ్డును పటిష్టంగా నిర్మించి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని, ఉత్తుత్తి రోడ్డుతో లక్షల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- ఫొటో : స్టాఫ్ ఫొటోగ్రాఫర్