ఘనంగా ‘క్విట్‌ ఇండియా’

ABN , First Publish Date - 2020-08-10T10:40:44+05:30 IST

నగరంలోని ఇందిరా విజ్ఞాన భవనంలో జిల్లా కాం గ్రెస్‌ పార్టీ సేవాదళ్‌ ఆధ్వర్యంలో క్విట్‌ ఇండియా డేను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ‘క్విట్‌ ఇండియా’

గుజరాతీపేట: నగరంలోని ఇందిరా విజ్ఞాన భవనంలో జిల్లా కాం గ్రెస్‌ పార్టీ సేవాదళ్‌ ఆధ్వర్యంలో క్విట్‌ ఇండియా డేను  ఆదివారం  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేసిన కాంగ్రెస్‌ సేవాదళ్‌ జిల్లా అధ్యక్షడు పైడి నాగభూషణరావు మాట్లా డుతూ, స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ, నెహ్రూ, వల్లభాయ్‌ పటేల్‌ వంటి గొప్ప నేతల త్యాగాలు, బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పోరాడిన తీరు, ఉద్యమాలు, దేశ ప్రజల మధ్య ఉన్న ఐక్యత నేటి యువతకు మార్గదర్శకాలు అని తెలిపారు. ప్రస్తుతం దేశ నాయకుల్లో ఐక్యమత్యం కొరవడిందన్నారు. నేటి నాయకులు వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కేవీఎల్‌ఎస్‌ ఈశ్వరి, రెల్ల సురేష్‌, భైరి రాజేశ్వరరావు, దంత త్రినాథరావు, ఎన్‌.అశోక్‌, జగన్‌మోహనరావు, డి.బుజ్జిబాబు, ఎస్‌.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-10T10:40:44+05:30 IST