డికాక్ అర్ధ సెంచరీ.. వికెట్ల కోసం చెమటోడుస్తున్న భారత్
ABN , First Publish Date - 2022-01-22T01:05:30+05:30 IST
భారత్ నిర్దేశించిన 288 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన
పార్ల్: భారత్ నిర్దేశించిన 288 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా దీటుగా బదులిస్తోంది. ఓపెనర్లు జానెమన్ మలాన్, క్వింటన్ డికాక్ భారత బౌలర్లను ఎలాంటి తడబాటు లేకుండా ఎదుర్కొంటూ విజయం దిశగా జట్టును నడిపిస్తున్నారు.
ఈ క్రమంలో డికాక్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా మలాన్ అతడికి అండగా నిలుస్తూ పరుగులు సాధిస్తున్నాడు. 15 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా వికెట్ నష్టపోకుండా 93 పరుగులు చేసింది. మలాన్ 33, డికాక్ 58 పరుగులతో క్రీజులో ఉన్నారు.