TDP నేతలను చొక్కా పట్టుకుని ప్రశ్నించండి: బొత్స

ABN , First Publish Date - 2022-05-08T00:47:52+05:30 IST

టీడీపీ నాయకులు వస్తే వారి చొక్కా పట్టుకుని ప్రశ్నించాలని, ఈ బాధ్యతను మహిళలు తీసుకోవాలని విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ

TDP నేతలను చొక్కా పట్టుకుని ప్రశ్నించండి: బొత్స

శ్రీకాకుళం: టీడీపీ నాయకులు వస్తే వారి చొక్కా పట్టుకుని ప్రశ్నించాలని, ఈ బాధ్యతను మహిళలు తీసుకోవాలని విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు టీడీపీ (TDP) నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజు ముఖ్యమంత్రిని తిట్టడమే ధ్యేయంగా చంద్రబాబు, ఆపార్టీ పనిచేస్తోందని దుయ్యబట్టారు. వారికి ఈ ప్రభుత్వం చేస్తున్న ఆభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మాదిరి జన్మభూమి కమిటీల్లా ఏ పథకం వచ్చినా దోచుకో లేదని, నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు అందజేశామని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Read more