అర గంట ముందు ప్రశ్నపత్రం
ABN , First Publish Date - 2021-10-21T06:24:09+05:30 IST
రాష్ట్ర విద్యాశిక్షణ పరిశోధన సంస్థ రాష్ట్ర సంచాలకుడి ఆదేశాల మేరకు అరగంట ముందు ప్రశ్నపత్రం వాట్సాప్ ద్వారా అందజేస్తారని డీఈఓ శామ్యూల్ బుధవారం ప్రకటనలో తెలిపారు.
అనంతపురం విద్య, అక్టోబరు 20: రాష్ట్ర విద్యాశిక్షణ పరిశోధన సంస్థ రాష్ట్ర సంచాలకుడి ఆదేశాల మేరకు అరగంట ముందు ప్రశ్నపత్రం వాట్సాప్ ద్వారా అందజేస్తారని డీఈఓ శామ్యూల్ బుధవారం ప్రకటనలో తెలిపారు. గురువారం ప్రారంభమయ్యే నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించిన ప్రశ్నపత్రాలు అరగంట ముందు ఎంఈఓలకు పంపుతారన్నారు. వాటిని ఎంఈఓలు తమ పరిధిలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వాట్సాప్ ద్వారా చేరవేసి, పరీక్షలు సజావుగా సాగేలా ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలు ఏర్పాట్లు చేయాలని డీఈఓ ఆదేశించారు.
సెలవులో డీఎ్సఓ
అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 20: జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి (డీఎ్సఓ) రఘురామిరెడ్డి వ్యక్తిగత కారణాలతో నా లుగు రోజులు సెలవు పెట్టారు. ఆయన తిరిగి వచ్చే వరకు ఏఎ్సఓ జగనమోహనరావు ఇనచార్జి డీఎ్సఓగా వ్యవహరించనున్నారు.