ఎంఏ పరీక్షలకు చదువుతున్నా!

ABN , First Publish Date - 2020-04-02T09:57:02+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌ సన్నద్ధతలో భాగంగా భారత మహిళల హాకీ జట్టుకు ఇటీవల స్థానిక సాయ్‌ సెంటర్‌లో సన్నాహక శిబిరం ఏర్పాటు చేశారు. అయితే కరోనా

ఎంఏ పరీక్షలకు చదువుతున్నా!

హాకీ కెప్టెన్‌ రాణి

బెంగళూరు: టోక్యో ఒలింపిక్స్‌ సన్నద్ధతలో భాగంగా భారత మహిళల హాకీ జట్టుకు ఇటీవల స్థానిక సాయ్‌ సెంటర్‌లో సన్నాహక శిబిరం ఏర్పాటు చేశారు. అయితే కరోనా వైర్‌సను కట్టడి చేయడానికి ప్రధాని మోదీ దేశం మొత్తం లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో భారత మహిళల జట్టు సాయ్‌ సెంటర్‌లోనే ఉండిపోయింది. ఇక టోక్యో ఒలింపిక్స్‌ కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. కాబట్టి ఖాళీ సమయాన్ని తన ఎంఏ పరీక్షల కోసం సద్వినియోగం చేసుకుంటున్నట్టు కెప్టెన్‌ రాణీ రాంపాల్‌ తెలిపింది.

Updated Date - 2020-04-02T09:57:02+05:30 IST