పెళ్లైన రెండు నెలలకే విడాకులు ఇచ్చేసింది.. వేరే వ్యక్తితో సహజీవనం ప్రారంభించింది.. అతడితో విభేదాలు రావడంతో ఆమె చేసిన ఘోరం ఏంటంటే..

ABN , First Publish Date - 2021-12-13T22:50:59+05:30 IST

ఆమెకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.. పెళ్లైన రెండు నెలలకే భర్తకు విడాకులు ఇచ్చేసింది..

పెళ్లైన రెండు నెలలకే విడాకులు ఇచ్చేసింది.. వేరే వ్యక్తితో సహజీవనం ప్రారంభించింది.. అతడితో విభేదాలు రావడంతో ఆమె చేసిన ఘోరం ఏంటంటే..

ఆమెకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.. పెళ్లైన రెండు నెలలకే భర్తకు విడాకులు ఇచ్చేసింది.. వేరే యువకుడితో సహజీవనం ప్రారంభించింది.. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.. రోజూ గొడవలు జరిగేవి.. దీంతో ఆమె అతడిని ఓ ఇనుప రాడ్డుతో కొట్టి చంపేసింది.. పోలీసులకు దొరక్కుండా ఐదు నెలల పాటు తప్పించుకుని తిరిగింది.. తాజాగా పోలీసులకు దొరికిపోయింది.. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన పూనమ్ అనే యువతి కథ ఇది. 


అల్వార్‌కు చెందిన పూనమ్ అనే యువతికి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన రెండు నెలలకే భర్తకు విడాకులు ఇచ్చేసింది. కరణ్ సింగ్ అనే యువకుడితో సహజీవనం ప్రారంభించింది. అల్వార్‌లోని ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఇద్దరూ కలిసి నివసించేవారు. ఈ ఏడాది జూన్‌లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అవి తారస్థాయికి చేరడంతో జూన్ 25న కరణ్ తలపై ఓ ఇనుప రాడ్‌తో పూనమ్ కొట్టింది. తీవ్ర రక్తస్రావం కావడంతో కరణ్ నేలకూలిపోయాడు. 


కరణ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పూనమ్ అక్కణ్నుంచి పరారైంది. కరణ్‌ను అతని కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో కరణ్ హస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూనమ్ కోసం అన్వేషణ ప్రారంభించారు. తన స్నేహితుల సహాయంతో పూనమ్ పోలీసులకు దొరక్కుండా ఐదున్నెర నెలలు తప్పించుకుని తిరిగింది. ఎట్టకేలకు ఆదివారం దొరికిపోయింది. పూనమ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. 

Updated Date - 2021-12-13T22:50:59+05:30 IST