క్వారంటైన్‌ ఏర్పాటుకు పరిశీలన

ABN , First Publish Date - 2021-05-11T07:24:25+05:30 IST

కొండపిలోని గురుకుల కళాశాలను కందుకూరు సబ్‌ కలెక్టర్‌ భార్గవ్‌తేజ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు సోమవారం పరిశీలించారు.

క్వారంటైన్‌ ఏర్పాటుకు పరిశీలన
గురుకుల కళాశాలను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ భార్గవ్‌తేజ

గురుకుల కళాశాలను సందర్శించిన జేసీ

కొండపి, మే 10: కొండపిలోని గురుకుల కళాశాలను కందుకూరు సబ్‌ కలెక్టర్‌ భార్గవ్‌తేజ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు సోమవారం పరిశీలించారు. కరోనా రో గుల కోసం క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు చేయడానికి కళాశాలలో ఉన్న వసతులను సబ్‌కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. సింగరాయకొండలోని గురుకుల కళాశాలతోపాటు కొండపిలోని కళాశాలను కూడా సబ్‌కలెక్టర్‌ పరిశీలించారు. అవసరాన్ని బట్టి ఏదో ఒక చోట క్వా రంటైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని అధికారులు తెలిపారు. సబ్‌ కలెక్టర్‌ వెంట కొండపి నియోజకవర్గ ప్రత్యేకాధికారి పీవీ. నారాయణరావు, సింగరాయకొండ సీఐ యు. శ్రీనివాస్‌, తహసీల్దార్‌ కామేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్‌ ఈసీ కోటేశ్వరరావు, సీహెచ్‌సీ డాక్టర్‌ పి. భక్తవత్సలం, ఎస్సై రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T07:24:25+05:30 IST