భార్య బండారం బయటపెట్టిన మూడో భర్త.. ఆమె ఉద్యోగం ఎలా సంపాదించిందో తెలుసుకుంటే షాక్!

ABN , First Publish Date - 2022-02-21T22:15:23+05:30 IST

ఆమె ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. ఇద్దర భర్తలకు విడాకులు ఇచ్చి మూడో భర్తతో జీవిస్తోంది..

భార్య బండారం బయటపెట్టిన మూడో భర్త.. ఆమె ఉద్యోగం ఎలా సంపాదించిందో తెలుసుకుంటే షాక్!

ఆమె ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. ఇద్దర భర్తలకు విడాకులు ఇచ్చి మూడో భర్తతో జీవిస్తోంది.. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.. దీంతో అతను ఆమె బండారం మొత్తం బయటపెట్టాడు.. ఉద్యోగం సంపాదించడానికి ఆమె చేసిన ఛీటింగ్ గురించి పోలీసులకు చెప్పేశాడు.. కేసు మొత్తం విచారించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 


రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఝంఝును గ్రామానికి చెందిన మంజూ దేవి అనే మహిళ 1996లో ప్రభుత్వ ఉద్యోగి అయిన రామ్ నివాస్‌ని వివాహం చేసుకుంది. నాలుగేళ్ల కాపురం తర్వాత 2000లో అతడికి విడాకులు ఇచ్చి బాబూలాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కాగా, ఆమె విడాకులు ఇచ్చిన మొదటి భర్త రామ్ నివాస్ 2001లో చనిపోయాడు. దీంతో రామ్ నివాస్ భార్యగా తన పేరు ఉండేలా మంజు నకిలీ డెత్ సర్టిఫికెట్ సంపాదించింది. అది చూపించి 2008లో టీచర్‌గా ఉద్యోగం సంపాదించింది. కొన్ని రోజులకు రెండో భర్త నుంచి కూడా విడిపోయింది. 


2011లో మహేష్ కుమార్ అనే వ్యక్తిని త‌ృతీయ వివాహం చేసుకుంది. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో మహేష్‌పై మంజు వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దీంతో మంజు చేసిన ఫ్రాడ్ గురించి జిల్లా ఎస్పీకి మహేష్ ఫిర్యాదు చేశాడు. దీంతో మంజు ఉద్యోగ వ్యవహారంపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. విచారణలో మంజు దేవి అసలు విషయం అంగీకరించడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కాగా, ఉద్యోగం సంపాదించిన తర్వాత 14 ఏళ్లలో మంజు రూ.88 లక్షలును జీతంగా పొందింది.  

Updated Date - 2022-02-21T22:15:23+05:30 IST