హోం క్వారంటైన్‌కు 40 మంది బెటాలియన్‌ సిబ్బంది!

ABN , First Publish Date - 2020-05-28T11:00:01+05:30 IST

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ భద్రత కోసం వెళ్లిన ఏడో బెటాలియన్‌కు చెందిన 40 మంది పోలీసులు భద్రత ఏర్పాట్లు

హోం క్వారంటైన్‌కు 40 మంది బెటాలియన్‌ సిబ్బంది!

డిచ్‌పల్లి, మే 27:  ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ భద్రత కోసం వెళ్లిన ఏడో బెటాలియన్‌కు చెందిన 40 మంది పోలీసులు భద్రత ఏర్పాట్లు ముగించుకొని డిచ్‌పల్లికి చేరుకున్నారు. వారందరికీ ముందస్తుగా హోం క్వారంటైన్‌కు తర లించినట్లు బెటాలియన్‌ కమాండెంట్‌ సత్య శ్రీనివాస్‌ బుధవారం తెలిపారు. ఢిల్లీకి బస్సులోనే జవాన్లు వెళ్లడం, విధులు ముగించుకొని తిరిగి బస్సుల్లోనే రావడంతో వైద్య పరీక్షలు చేసి హోం క్వారంటైన్‌కు తరలించామన్నారు. హోం క్వారంటైన్‌ ముగిసిన అనంతరం వారి స్వస్థలాలకు తరలించనున్నట్లు తెలి సింది. దేశ రాజధాని ఢిల్లీలో విధులు నిర్వహించిన భద్రత జవాన్లు క్షేమంగా బెటాలియన్‌కు చేరుకున్నారని కమాండెంట్‌ తెలిపారు. 


ఘన్‌పూర్‌లో ఒకరికి హోం క్వారంటైన్‌... 

డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని బుధవారం హోం క్వారంటైన్‌కు అధికారులు తరలించారు. ఇటీవలే ఆ వ్యక్తి గల్ఫ్‌ నుంచి వచ్చి కొన్ని రోజులుగా వరంగల్‌, హన్మకొండలో బంధువుల ఇళ్ల వద్ద ఉండి ఘన్‌పూర్‌ రావడంతో జలుబు దగ్గు, ఉన్న ఆయనను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి ముందస్తుగా 14రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. 

Updated Date - 2020-05-28T11:00:01+05:30 IST