50 పడకలలో క్వారంటైన్ ఏర్పాటు
ABN , First Publish Date - 2020-03-31T10:08:36+05:30 IST
మండలంలోని అంబవరం గ్రామ శివారులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 50 పడకల క్వారంటైన్ను ఏర్పాటు చేసినట్లు
జమ్మలమడుగు, మార్చి 30: మండలంలోని అంబవరం గ్రామ శివారులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 50 పడకల క్వారంటైన్ను ఏర్పాటు చేసినట్లు అర్బన్ సీఐ మధుసూదన్రావు తెలిపారు. సోమవారం ఏర్పాటు చేస్తున్న అంబవరం గ్రామ పాలిటెక్నిక్ కళాశాల వద్ద స్థానికులు ఇక్కడ ఏర్పాటు చేయడం వద్దని పోలీసులకు తెలిపారు. ఏది ఏమైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున కరోనా వైరస్ బాధితులకు క్వారంటైన్ ఏర్పాటు చే యడం జరిగిందని అందులో భాగంగా ప్రొద్దుటూరు నుంచి 13 మందిని క్వారంటైన్కు తెచ్చినట్లు సీఐ తెలిపారు.