క్వారంటైన్ పూర్తయింది: శ్రద్ధా శ్రీనాథ్
ABN , First Publish Date - 2020-04-04T09:37:54+05:30 IST
క్వారంటైన్ పూర్తయింది: శ్రద్ధా శ్రీనాథ్
కరోనా వైరస్ గురించి తనపై వస్తున్న వార్తలను జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ ఖండించారు. ఇటీవల విమాన ప్రయాణం చేసిన నేపథ్యంలో శ్రద్ధను హోం క్వారంటైన్లో ఉండాలని కర్ణాటక ఆరోగ్యశాఖ ఆదేశించిందని వస్తున్న వార్తలో నిజంలేదని ఆమె ట్విటర్ వేదికగా తెలిపారు. ‘‘గత నెల 12 -15 తేదీల్లో హైదరాబాద్ నుంచి చెన్నైకు విమాన ప్రయాణం చేశాను. నేను ఇంటికి చేరాక కర్ణాటక ఆరోగ్యశాఖ వారు ఎవరూ నా దగ్గరకు రాలేదు. నా కజిన్ ఒకరు డాక్టర్ కావడంతో తన సూచనల మేరకు ముందు జాగ్రత్తగా నాకు నేనుగా 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉన్నా. విదేశాలకు ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరూ ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించాలి. మార్చి 29 నాటికి నా క్వారంటైన్ 14 రోజులు పూర్తయింది’’ అని శ్రద్ధ ట్వీట్ చేశారు.