క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు
ABN , First Publish Date - 2020-03-28T09:20:24+05:30 IST
మడకశిర జూనియర్ కళాశాల, రొళ్ల గురుకుల వసతిగృహంలో కరోనా అనుమానితుల కోసం క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు
మడకశిర టౌన్/మడకశిర అర్బన్/రొళ్ల/గుత్తి, మార్చి 27: మడకశిర జూనియర్ కళాశాల, రొళ్ల గురుకుల వసతిగృహంలో కరోనా అనుమానితుల కోసం క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్లు ఆనందకుమార్, తహసీల్దార్ హసీనా సుల్తానా శుక్రవారం తెలిపారు. మడకశి ర కేంద్రాన్ని సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ రాజేష్ పర్యవేక్షించారు. అనంతరం డైలీమార్కెట్వ్యాపారులకు గ్లౌస్లు పంపి ణీ చేశారు. గుత్తి శివారులోని గేట్స్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్ వార్డును శు క్రవారం జిల్లా హెల్త్ ఎస్ఈ శ్రీనాథ్ రెడ్డి, తహసీల్దారు బ్రహ్మయ్య, మున్సిపల్ క మిషనర్ గంగిరెడ్డి పరిశీలించారు. 50 పడకలు అందుబాటులో ఉంచామన్నారు. కరోనా అనుమానిత కేసులను ఇక్కడికి తరలిస్తామన్నారు.