మండల కేంద్రాలు, మురికివాడల్లో క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలి: సీపీఎం

ABN , First Publish Date - 2020-08-13T07:43:09+05:30 IST

కరోనా విజృంభిస్తున్నందున మండల కేంద్రాలు, పట్టణాల్లోని మురికివాడల్లో క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర

మండల కేంద్రాలు, మురికివాడల్లో క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలి: సీపీఎం

కరోనా విజృంభిస్తున్నందున మండల కేంద్రాలు, పట్టణాల్లోని మురికివాడల్లో క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్‌ చేసింది. కరోనా సహాయక చర్యల్లో పనిచేయడానికి తమ కార్యకర్తలను సిద్ధం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఎంబీ భవన్‌లో బి.వెంకట్‌ అధ్యక్షతన బుధవారం  నిర్వహించిన సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉచితంగా మందులు, ఆహా రం, ఇతర వసతి సౌకర్యాలు సమకూర్చాలని సమావేశం డిమాండ్‌ చేసింది. 

Updated Date - 2020-08-13T07:43:09+05:30 IST