క్వారంటైన్‌ కేంద్రాల పెంపు

ABN , First Publish Date - 2020-03-30T10:07:26+05:30 IST

జిల్లాలో క్వారంటైన్‌ కేంద్రాలను పెంచాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. ప్రస్తు తం ఉన్న వాటికి అదనంగా నియోజ కవర్గానికి ఒకటి ఏర్పాటు

క్వారంటైన్‌ కేంద్రాల పెంపు

నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు 

సత్వర చర్యలు తీసుకోవాలి

పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి 

నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం 

కలెక్టర్‌ భాస్కర్‌ ఆదేశం 

అధికారులతో అత్యవసర సమావేశం


ఒంగోలు (జడ్పీ), మార్చి 29 : జిల్లాలో క్వారంటైన్‌ కేంద్రాలను పెంచాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. ప్రస్తు తం ఉన్న వాటికి అదనంగా నియోజ కవర్గానికి ఒకటి ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన భవనంలో అధికారులతో ఆ యన ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకూ జిల్లాలో నాలుగు క్వారంటైన్‌ కేంద్రాలు నడుస్తు న్నాయని చెప్పారు.


అదనంగా గిద్దలూరు, కంభం, ఎర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం, కనిగిరి, చీమకుర్తి, పర్చూరు ప్రాంతాల్లో ఏర్పా టు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అక్కడ పారిశుధ్య పనులు శరవేగంగా చేపట్టాలని, అధికారులు అన్నివేళలా అందుబాటులో ఉండాల న్నారు. నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్ప ష్టం చేశారు.  ఈ సమావే శంలో జేసీ  ఎస్‌. షన్మోహన్‌, డీఆర్వో వెంకట సుబ్బయ్య, ప్రత్యే క కలెక్టర్‌ గంగాధ ర్‌గౌడ్‌ తదితర అధి కారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-30T10:07:26+05:30 IST