గుర్ల క్వారంటైన్ కేంద్రం పరిశీలన
ABN , First Publish Date - 2020-07-09T11:06:18+05:30 IST
గుర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు కేసలి అప్పారావు బుధవారం పరి శీలించారు.
గుర్ల, జూలై 8: గుర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు కేసలి అప్పారావు బుధవారం పరి శీలించారు. అక్కడి సదుపాయాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కేంద్రంలో 80 మంది వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా బాలల హక్కుల, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.