క్వారంటైన్ కేంద్రం తనిఖీ
ABN , First Publish Date - 2020-05-25T10:19:44+05:30 IST
పట్టణ సమీపంలోని ఏపీ టిడ్కో నిర్మించిన గృహనిర్మాణ సము దాయంలో ఏర్పాటు చేసిన క్వారెంటైన్ కేంద్రాన్ని
ఆత్మకూరు, మే 24 : పట్టణ సమీపంలోని ఏపీ టిడ్కో నిర్మించిన గృహనిర్మాణ సము దాయంలో ఏర్పాటు చేసిన క్వారెంటైన్ కేంద్రాన్ని ఆదివారం తహసీల్దారు వై మధుసూ దన్రావు తనిఖీ చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన 89 మంది క్వారంటైన్ సెంటర్లో ఉండగా వసతులను అడిగి తెలుసుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుని మెరుగైన వసతులు కల్పించాలని సిబ్బందికి సూచించారు.