మంచి భోజనం పెడతారా.. క్వారంటైన్ నుంచి పారిపోమంటారా!?
ABN , First Publish Date - 2020-04-07T16:42:05+05:30 IST
నాణ్యమైన భోజనం పెట్టాలనీ, లేకుంటే ఇక్కడి నుంచి పారిపోతామని
అనంతపురం/ధర్మవరం : నాణ్యమైన భోజనం పెట్టాలనీ, లేకుంటే ఇక్కడి నుంచి పారిపోతామని ధర్మవరంలో క్వారంటైన్లో ఉన్నవారు సోమవారం ఆందోళనకు దిగారు. ఇటీవల ఢిల్లీలోని జకాత్కు వెళ్లివచ్చిన 15 మందికి కరోనా లక్షణాలున్నాయన్న అనుమానంతో పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్కు 5 రోజుల క్రితం తరలించారు. నాసిరకం భోజనం పెడుతున్నారనీ, తినలేక ఇబ్బందులు పడుతున్నామ ని వారు పేర్కొన్నారు. పస్తులైనా ఉంటాం కానీ, భోజనం చేసేది లేదంటూ భీష్మించారు. ఆర్డీఓ మధుసూదన్ దాతలకు ఫోన్ చేసి, నాణ్యమైన బియ్యంతో ఆహారం అందించేందుకు చర్యలు తీసుకున్నారు.