నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
ABN , First Publish Date - 2022-07-04T04:32:54+05:30 IST
పట్టణంలో 300 పడకల ఆస్ప త్రి నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం లేకుండా పను లు చేపట్టాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అ న్నారు.
- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
- ఆస్పత్రి నిర్మాణ పనులు పరిశీలన
గద్వాల, జూలై 3: పట్టణంలో 300 పడకల ఆస్ప త్రి నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం లేకుండా పను లు చేపట్టాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అ న్నారు. ఆదివారం మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ తో దౌదర్పల్లి దర్గా సమీపంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలతో నిర్మాణ పను లు చేపట్టాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఏదైన స మస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే వెంట రైతుబంధు జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, మునిసిపల్ వైస్ చైర్మన్ బా బర్, కౌన్సిలర్లు నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, శ్రీను, గద్వాల పట్టణ అధ్యక్షుడు గోవింధు, ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్రెడ్డి, ఉపాధ్యక్షులు ధర్మనా యుడు, నాయకులు కోటేష్, రామకృష్ణశెట్టి, భగీరథ వంశీ, పవన్, కృష్ణ, వీరేష్రాజు తదితరులున్నారు.
రేడియోలజీ ల్యాబ్ నిర్మాణ పనులు ప్రారంభం
గద్వాల క్రైం: జిల్లాకేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆ స్పత్రిలో రేడియోలజీ ల్యాబ్ నిర్మాణ పనులను ఆది వారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ము ఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగానికి పెద్దపీట వేశా రన్నారు. ల్యాబ్ నిర్మాణానికి రూ. 70లక్షలు మంజూ రు చేసిందన్నారు. అన్ని వసతులతో భవననిర్మాణం చేపడుతామన్నారు.