ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ABN , First Publish Date - 2022-07-02T06:25:28+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని నాప్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు. గంభీరావుపేట మండల దమ్మన్నపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
భూమిపూజ చేస్తున్న కొండూరు రవీందర్‌రావు

గంభీరావుపేట, జూలై 1: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని  నాప్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు  అన్నారు. గంభీరావుపేట మండల దమ్మన్నపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కింద మౌలిక వసతులకు నిధులు కేటాయించిందన్నారు. జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, సర్పంచ్‌ సిరిగిరి లక్ష్మి, ఎంపీటీసీ మూడు కవిత, హెడ్‌ మాస్టర్లు ఎర్ర సత్యనారాయణ, బోయన్నగారి నారాయణ, ఎస్‌ఎంసీ చైర్మెన్‌ అరుట్ల వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ గ్రామ శఅధ్యక్షుడు వేణు, రైతు సమన్వయ సమితి అద్యక్షుడు ఎల్లయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-07-02T06:25:28+05:30 IST