ఖతర్లో లక్షకు చేరిన కరోనా కేసులు..!
ABN , First Publish Date - 2020-07-06T20:49:06+05:30 IST
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఖతర్లోనూ కొవిడ్-19 కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే ఖతర్లో 616 కరోనా కేసులు నమోద్వగా..
దోహా: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఖతర్లోనూ కొవిడ్-19 కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే ఖతర్లో 616 కరోనా కేసులు నమోద్వగా.. ఐదుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు ఖతర్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 99,799కి చేరింది. ఇందులో దాదాపు 92వేల మంది కరోనాను జయించి, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఖతర్లో 7వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఖతర్లో నిన్న సంభవించిన కరోనా మరణాలతో.. మృతుల సంఖ్య 128కు చేరింది. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారినపడిన వారి సంఖ్య 1.15కోట్లకు చేరింది. కరోనా కాటుకు 5.37లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.