గురుకులంలోకి కొండచిలువ!

ABN , First Publish Date - 2021-12-01T05:22:49+05:30 IST

గురుకులంలోకి కొండచిలువ!

గురుకులంలోకి కొండచిలువ!

  • విద్యార్థినులు, ఉపాధ్యాయినుల భయాందోళన

ధారూరు: ధారూరులోని కస్తూర్బాగాంధీ గురుకుల విద్యాలయం ఆవరణలోకి  మంగళవారం సాయంత్రం పెద్ద కొండ చిలువ దూరింది. దీంతో టీచర్లను, విద్యా ర్థినులను భయాందోళనకు గురయ్యారు. కేజీబీవి ప క్కనే ఉన్న పీహెచ్‌సీ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కల ను తొలగిస్తుండగా అందులో మరుగు చేసుకున్న కొండచిలువ పాఠశాల ప్రహారి దాటి ఆవరణలోకి వచ్చింది. పంచాయతీ సిబ్బంది, మండల పరిషత్‌ అటెండర్‌ కోటయ్య వచ్చి పాఠశాల ఆవరణలోకి వచ్చిన కొండచిలువను కొట్టి చంపేశారు. దీంతో ఉపాధ్యాయినులు, విద్యార్థినులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2021-12-01T05:22:49+05:30 IST