పీడబ్ల్యూడీకి కొత్త వాహనాలు

ABN , First Publish Date - 2022-05-05T13:57:32+05:30 IST

ప్రజాపనుల శాఖ ఆధ్వర్యంలో ఆ శాఖలో పనిచేస్తున్న డిజైనర్లు, చీఫ్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లకు రూ.2.38 కోట్లతో కొనుగోలు చేసిన కొత్త వాహనాలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సచివాలయం వద్ద

పీడబ్ల్యూడీకి కొత్త వాహనాలు

                         - ప్రారంభించిన Cm stalin


చెన్నై: ప్రజాపనుల శాఖ ఆధ్వర్యంలో ఆ శాఖలో పనిచేస్తున్న డిజైనర్లు, చీఫ్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లకు రూ.2.38 కోట్లతో కొనుగోలు చేసిన కొత్త వాహనాలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సచివాలయం వద్ద బుధవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ఇటీవల శాసనసభలో ప్రజాపనుల శాఖకు సంబంధించిన ఆర్థిక పద్దులపై చర్చ జరిగినసమయంలో ఆ శాఖలో పనిచేస్తున్న డిజైనర్లు, ఇంజనీర్లకు రూ.2.38 కోట్లతో ఏడు కార్లు సహా 29 వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు మంత్రి ఏవీ వేలు ప్రకటించారు. ఆ మేరకు ప్రజాపనుల శాఖ 29 వాహనాలను కొనుగోలు చేసింది. ఆ వాహనాలను ఇంజనీర్లకు అందజేసేందుకు బుధవారం జరిగిన కార్యక్రమంలో ఐదు వాహనాలను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాపనుల శాఖ మంత్రి ఏవీ వేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, ప్రజాపనుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి దయానంద్‌ కఠారియా, ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఇరా విశ్వనాధ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more