డీజీపీ సవాంగ్ను కలిసిన పీవీ సింధు
ABN , First Publish Date - 2021-08-14T02:07:32+05:30 IST
డీజీపీ గౌతమ్ సవాంగ్ను బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కలిశారు. సింధూకు ప్రపంచ స్థాయిలో పతకం సాధించడం ఏపీకి దక్కిన గౌరవమని డీజీపీ కొనియాడారు.
అమరావతి: డీజీపీ గౌతమ్ సవాంగ్ను బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కలిశారు. సింధూకు ప్రపంచ స్థాయిలో పతకం సాధించడం ఏపీకి దక్కిన గౌరవమని డీజీపీ కొనియాడారు. ఆమె సాధించిన విజయం మహిళలు, యువతకు ప్రేరణ, స్ఫూర్తి నిస్తాయని, రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని డీజీపీ సవాంగ్ ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వం, పోలీస్ శాఖ మహిళల కోసం చేస్తున్న కృషిని పీవీ సింధు కొనియాడారు. ప్రతి మహిళ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని పీవీ సింధు కోరారు.