గవర్నర్ను కలవనున్న పీవీ సింధు
ABN , First Publish Date - 2021-08-13T20:51:46+05:30 IST
బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు విజయవాడకు వచ్చారు. నేడు పీవీ సింధు గవర్నర్ బిశ్వభూషన్ను కలవనున్నారు.
విజయవాడ: బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు విజయవాడకు వచ్చారు. నేడు పీవీ సింధు గవర్నర్ బిశ్వభూషన్ను కలవనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె విజయవాడకు వచ్చారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను పీవీ సింధు కలిశారు. టోక్యో ఒలింపిక్స్లో గెలుచుకున్న కాంస్య పతకాన్ని సీఎంకు చూపించారు. సింధును ఆయన సత్కరించారు. మీ ఆశీర్వాదంతోనే పతకాన్ని నెగ్గానని జగన్కు సింధు తెలిపింది. దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారని సీఎం కొనియాడారు. విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారుకావాలని జగన్ ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదు బహుమానాన్ని అధికారులు అందించారు.