శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న పీవీ సింధు
ABN , First Publish Date - 2021-08-04T20:14:39+05:30 IST
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఈ సందర్భంగా సింధుకు అధికారులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.
హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఈ సందర్భంగా సింధుకు అధికారులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఒలింపిక్ పతకం గెలిచాక హైదరాబాద్కు పీవీ సింధు తొలిసారి వచ్చింది. ఆమెకు మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి స్వాగతం పలికారు. టోక్యో ఒలింపిక్స్లో సింధు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 30 లక్షల నగదు అందించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి క్రీడా పాలసీ ప్రకారం సింధుకు నగదు ప్రోత్సాహకం అందించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ క్రీడాశాఖ అధికారులను మంగళవారం ఆదేశించారు. సింధుతో పాటు ఇటీవల కాలంలో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారులందరికీ నజరానాలు వెంటనే ఇవ్వాల్సిందిగా అధికారులకు జగన్ సూచించారు.