Tokyo olympics: సింధు సునాయాస విజయం

ABN , First Publish Date - 2021-07-28T14:20:39+05:30 IST

విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పీవీ సింధు అదరగొడుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది.

Tokyo olympics: సింధు సునాయాస విజయం

టోక్యో: విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పీవీ సింధు అదరగొడుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. గ్రూపు-జేలో రెండో మ్యాచ్‌లో భాగంగా హంగ్‌కాంగ్‌కు చెందిన ఎన్‌వై చేంగ్‌పై 21-9, 21-16 తేడాతో వరుస సెట్లలో సునాయాస విజయం సాధించింది. ఇక తొలి మ్యాచ్‌లో కూడా సింధు ఇజ్రాయెల్ షట్లర్‌‌తో తలపడి కేవలం 28 నిమిషాల్లో మ్యాచును ముగించిన విషయం తెలిసిందే. ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్న సింధు భారత్‌కు మరో పతకాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు భారత మహిళల హాకీ జట్టు వరుసగా మూడో మ్యాచులోనూ ఓడిపోయి నిరాశపరిచింది. బ్రిటన్‌తో జరిగిన మ్యాచులో భారత అమ్మాయిలు 1-4 తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.  

Updated Date - 2021-07-28T14:20:39+05:30 IST