Indonesia Open: క్వార్టర్ ఫైనల్‌కు చేరిన పీవీ సింధు

ABN , First Publish Date - 2021-11-26T00:20:08+05:30 IST

భారత బ్యాడ్మింటన్ స్టార్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు ఇండోనేషియా సూపర్ 1000 క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

Indonesia Open: క్వార్టర్ ఫైనల్‌కు చేరిన పీవీ సింధు

బాలి: భారత బ్యాడ్మింటన్ స్టార్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు ఇండోనేషియా సూపర్ 1000 క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జర్మనీకి చెందిన వైవోన్ లీ‌తోజరిగిన పోరులో వరుస సెట్లలో సింధు విజయం సాధించింది. మహిళల సింగిల్స్ సెకండ్ రౌండ్‌లో 37 నిమిషాల్లోనే సింధు మ్యాచ్‌ను ముగించింది.  21-12, 21-18తో వరుస సెట్లలో విజయం సాధించి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. 


మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన సింధు తొలి గేమ్‌ను చాలా సులభంగా సొంతం చేసుకుంది. ఒకానొక సమయంలో వరుసగా ఏడు పాయింట్లు సాధించింది. రెండో గేమ్‌లో పుంజుకున్న లీ కొంత పోటీ ఇచ్చినప్పటికీ సింధు దూకుడు ముందు నిలవలేక చేతులెత్తేసింది. కాగా, స్పెయిన్‌కు చెందిన బీట్రిజ్ కొరాలెస్, దక్షిణ కొరియాకు చెందిన సిమ్ యుజిన్ మధ్య జరగనున్న సెకండ్ రౌండ్ పోటీలో విజయం సాధించిన క్రీడాకారిణితో సింధు క్వార్టర్ ఫైనల్‌లో తలపడుతుంది. 

Updated Date - 2021-11-26T00:20:08+05:30 IST