దుర్గమ్మను దర్శించుకున్న PV Sindhu.. 2024లో స్వర్ణం సాధిస్తా..

ABN , First Publish Date - 2021-08-06T14:03:23+05:30 IST

2024లో కూడా ఒలింపిక్స్‌లో ఆడాలని ఈసారి కచ్చితంగా స్వర్ణం సాధిస్తానని

దుర్గమ్మను దర్శించుకున్న PV Sindhu.. 2024లో స్వర్ణం సాధిస్తా..

విజయవాడ : టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కాంస్య పతకం సాధించిన అనంతరం ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సింధుకి పూర్ణకుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. సింధు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఆలయ ఈఓ భ్రమరాంబ అందించారు.


2024లో స్వర్ణం సాధిస్తా..

ఈ సందర్భంగా పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ.. టోర్నమెంట్‌కు వెళ్లేముందు అమ్మవారి దర్శనానికి వచ్చానని చెప్పారు. అమ్మవారి దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంకా టోర్నమెంట్లు ఆడాల్సి ఉందన్నారు. 2024లో కూడా ఒలింపిక్స్‌లో ఆడాలని ఈసారి కచ్చితంగా స్వర్ణం సాధిస్తానని సింధు ధీమాగా చెప్పారు. సింధుతో సెల్ఫీలు దిగడానికి పలువురు యువకులు ఎగబడ్డారు.



Updated Date - 2021-08-06T14:03:23+05:30 IST