సాగర్లో సింధు సందడి
ABN , First Publish Date - 2020-09-28T10:52:52+05:30 IST
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్.. తెలుగు షట్లర్ పీవీ సింధు నాగార్జున సాగర్లో సందడి చేసింది.
నాగార్జున సాగర్/విజయపురి సౌత్ (ఆంధ్రజ్యోతి): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్.. తెలుగు షట్లర్ పీవీ సింధు నాగార్జున సాగర్లో సందడి చేసింది. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ఆమె సాగర్ను సందర్శించింది. ఎడతెరిపి లేని వర్షాలతో నిండుకుండలా మారిన సాగర్ అందాలను చూసి సింధు తన్మయం చెందింది. సింధు వస్తుందన్న సమాచారం అందుకున్న ప్రాజెక్టు అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. సాగర్ జలాశయం ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రాజెక్టును దగ్గరుండి చూపించారు. పవర్హౌస్, జలవిద్యుత్ కేంద్రం, ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్, బుద్ధవనాన్ని ఆమె సందర్శించింది. ఈ సందర్భంగా హరితహారంలో భాగంగా మొక్కలు నాటింది.