దేశానికి పీవీ సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2022-06-29T05:50:17+05:30 IST

దేశానికి మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు చేసిన సేవలు మరువలేనివని డీసీసీ అఽధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ అన్నా రు.

దేశానికి పీవీ సేవలు మరువలేనివి
పీవీ చిత్రపటం వద్ద నివాళ్లర్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

- డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా

మహబూబ్‌నగర్‌/ జడ్చర్ల/ గండీడ్‌, జూన్‌ 28 : దేశానికి మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు చేసిన సేవలు మరువలేనివని డీసీసీ అఽధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ అన్నా రు. మంగళవారం పీవీ జయంతిని పురస్క రించుకుని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళ్లర్పించారు. బహుభాషా కోవిధు డని, పార్లమెంట్‌లో తగినంత మెజారిటీ లేకు న్నా ఐదేళ్లు తన రాజకీయ చతురతతో సుస్థిర పాలన అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు రంగారా వు, బెక్కరి అనిత, సీజె బెనహర్‌, లక్ష్మణ్‌ యా దవ్‌, సిరాజ్‌ఖాద్రి, రాములుయాదవ్‌, సుభాష్‌ ఖత్రి అబుకర్‌  పాల్గొన్నారు. 

జడ్చర్లలో మాజీ ప్రధానమంత్రి పీవీ నర సింహారావు జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. నాయ కులు బుక్క వెంకటేశ్‌, అశోక్‌ యాదవ్‌, ఆనంద్‌, సర్ఫరాజ్‌, రఘు, శ్రీనివాస్‌ యాదవ్‌, వంశీ, సంధ్య, నక్కా రాఘవేందర్‌, ఇంతి యాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

గండీడ్‌లో పీవీ నర్సింహారావు చిత్రపటాని కి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నర్సిం హారావు, సల్కర్‌పేట సర్పంచ్‌ జితేందర్‌రెడ్డి, ఎంపీటీసీ బాలయ్య, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ బాల స్వామి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కోనగారి రవీందర్‌రెడ్డి, దిగంబర్‌రావు, నారాయణ, వీరన్న, కోస్గి మొగులయ్య, అనిల్‌ ఉన్నారు.

Updated Date - 2022-06-29T05:50:17+05:30 IST