24 నుంచి పీవీ శత జయంతి ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-07-16T13:12:45+05:30 IST

దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలను ఈ నె ల 24 నుంచి ప్రారంభించాలని ..

24 నుంచి పీవీ శత జయంతి ఉత్సవాలు

హైదరాబాద్‌,(ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలను ఈ నె ల 24 నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌ గీతారెడ్డిలు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇటీవలే పీవీ కుటుంబ సభ్యులు పీవీ ప్రభాకర్‌రావు, పీవీ మనోహర్‌రావు, వాణీదేవిలతో సమావేశం అయ్యామని, ఉత్సవ కమిటీ చీఫ్‌ ప్యాట్రన్‌గా ఉండేందుకు మనోహర్‌ రావు అంగీకరించారని తెలిపారు.  ఉత్సవాలు ఏడాది పాటు జరుగుతాయన్నారు.

Updated Date - 2020-07-16T13:12:45+05:30 IST