కేటిఆర్ పై విషం కక్కడానికి వస్తున్నారు: puvvada ajay kumar
ABN , First Publish Date - 2022-05-14T22:24:55+05:30 IST
కేటిఆర్ పై విషం కక్కడానికి వస్తున్నారు: puvvada ajay kumar
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నాయకులు పర్యాటనలు కాంగ్రెస్, బీజెపి నేతలు క్యూ కడుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణలో కేసీఆర్, కేటిఆర్ పై విషం కక్కడానికి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహకారం అందకపోయనా అభివృద్ధి సాగుతుందన్నారు. ఆర్ బిఐ మీద ఒత్తిడి చేసి నిధులు రాకుండా కేంద్రం అడ్డుకుంటుందని ఆరోపించారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని అడ్డుకోవాలని చూస్తుందన్నారు. అమిత్ షా భ్రమలు కల్పించడానికి వస్తున్నారని విమర్శించారు. అబద్దాలు చెప్పే నాయకులు న్యాయ స్థానంలో సమస్యలు ఎదుర్కోవలిసి వస్తాదన్నారు. ఈ రాష్రానికి శ్రీ రామ రక్షగా కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు.