అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి
ABN , First Publish Date - 2020-10-23T11:03:49+05:30 IST
అత్యంత వెనుకబడిన కులాల్లోని పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని రాష్ట్ర ఎంబీసీ డెవల్పమెంట్ కార్పొరేషన్ ..
టంగుటూరు, అక్టోబరు 22 : అత్యంత వెనుకబడిన కులాల్లోని పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని రాష్ట్ర ఎంబీసీ డెవల్పమెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పుట్టా వెం కట్రావు చెప్పారు. స్టేట్ ఎంబీసీ డైరెక్టర్గా ఎంపికైన వెంకట్రావు గురువారం స్థానిక బుడబుక్కల కాలనీలో పర్యటించారు. కాలనీవాసుల స్థితిగతులపై చర్చించారు. అశోక్, అనిల్, క్రాంతికుమార్, రాజ్కుమార్, కోటయ్య, తిరుపతయ్య పాల్గొన్నారు.