వైసీపీ ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి: పుట్టా సుధాకర్

ABN , First Publish Date - 2021-07-25T18:12:30+05:30 IST

మతాల మధ్య చిచ్చుపెట్టడాన్ని వైసీపీ నేతలు మానుకోవాలని పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి: పుట్టా సుధాకర్

అమరావతి: మతాల మధ్య చిచ్చుపెట్టడాన్ని వైసీపీ నేతలు మానుకోవాలని టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి.. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధికి యత్నించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పంథా కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడిన ఘనత చంద్రబాబుదేనన్నారు. సామరస్యంగా ఉంటున్న మతాల మధ్య వైసీపీ చిచ్చు పెట్టేందుకు యత్నించడం దురదృష్టకరమన్నారు. జగన్ రెడ్డి రెండేళ్ల పాలనలో దేవాలయాలపై సుమారు 200 దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనలు జరిగాయని, ప్రభుత్వం అండతోనే అరాచకశక్తులు రెచ్చిపోతున్నాయన్నారు. దేవాలయాల విధ్వంసాలకు పాల్పడిన వారిని శిక్షించడంలో సీఎం జగన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని పుట్టా సుధాకర్ ఆరోపించారు.

Updated Date - 2021-07-25T18:12:30+05:30 IST