పుస్తకం శక్తివంతమైంది..

ABN , First Publish Date - 2022-05-26T03:48:33+05:30 IST

పుస్తకం అత్యంత శక్తిమైందని, ప్రపంచాన్ని కూడా మార్చగలిగేశక్తి ఒక్క పుస్తకానికి మాత్రమే ఉందని ప్రముఖ సాహితీవేత్త తిప్పావ

పుస్తకం శక్తివంతమైంది..
కోవూరు గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు


ఇందుకూరుపేట, మే 25 : పుస్తకం అత్యంత శక్తిమైందని, ప్రపంచాన్ని కూడా మార్చగలిగేశక్తి ఒక్క పుస్తకానికి మాత్రమే ఉందని ప్రముఖ సాహితీవేత్త తిప్పావజ్జుల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. బుధవారం గ్రంథాలయ శాఖలో జరిగిన వేసవి విజ్ఞాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ఎంత బాగా చదివితే అంత గొప్పగా రచనా శక్తి అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తక పఠనంతోపాటు కవితలు, చిత్రలేఖనంపై పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది చిన్నారులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.


కోవూరులో..


కోవూరు, మే 25 :  స్థానిక కాపువీధిలోని శాఖా గ్రంథాలయంలో బుఽధవారం లైబ్రేరియన్‌  జే సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం నిర్వహించారు. ఉపాధ్యా యుడు వై.మునీంద్ర కథలు, చిత్రలేఖనం, చదవడంపై  విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రత్యేక అతిఽథి  లయన్‌ వైసీ సుబ్బారావు ఇన్నోవేటివ్‌ క్విజ్‌  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న 40 మందికి బహుమతులు అందజేశారు. 


Updated Date - 2022-05-26T03:48:33+05:30 IST