సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో పుష్పయాగం

ABN , First Publish Date - 2022-08-17T05:12:09+05:30 IST

స్థానిక మున్సిపల్‌ కార్యాలయం సమీపం, శ్రీనివాసనగర్‌లో సప్తఫణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో శ్రావణమాసాన్ని పుర ష్కరించుకుని తిరుమంజనసేవ, పుష్ప యాగాన్ని మంగళవారం ఘనంగా నిర్వ హించారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో పుష్పయాగం
యాగానికి తీసుకొచ్చిన పలురకాల పూలు

హిందూపురం అర్బన, ఆగస్టు 16 : స్థానిక మున్సిపల్‌ కార్యాలయం సమీపం, శ్రీనివాసనగర్‌లో సప్తఫణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో శ్రావణమాసాన్ని పుర ష్కరించుకుని తిరుమంజనసేవ, పుష్ప యాగాన్ని మంగళవారం ఘనంగా నిర్వ హించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి వివిధ అభిషేకాలు, అర్చనలు చేశారు. పుష్పయాగం కోసం బెంగళూరు నుంచి వివిధ రకాల ప్రత్యేక పూలను తీసుకొ చ్చారు. వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయం నుంచి పుష్పాలను మంగళవాయిద్యాలు, మేళతాళాలతో ఊరే గింపుగా సుబ్రమణ్య స్వామి ఆలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తిరుమల పాదయాత్ర బృందం మహావిష్ణు సహస్త్రనామా పారాయణం, భజన, వేద పారాయణం నిర్వహించారు. 8 గంటలకు అష్టావధానసేవ, మహా మంగళహారతి నిర్వహించి మధ్యాహ్నం అన్నదానం చేపట్టారు. వివిధ పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో రెడ్డి జేఏసీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశరెడ్డి, బజరంగ్‌దళ్‌ నాయకులు నవీన తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-17T05:12:09+05:30 IST