సైనిక విమానంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2021-11-16T22:20:01+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో నూతనంగా నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ

సైనిక విమానంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నూతనంగా నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై  ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైనిక విమానంలో ల్యాండ్ కావడం దేశం మొత్తాన్ని ఆకర్షించింది. సుల్తాన్‌పూర్ జిల్లాలోని కర్వాల్ ఖేరి వద్ద మోదీ ప్రయాణించిన సి-130 హెర్క్యులస్ సైనిక రవాణా విమానం ల్యాండ్ అయింది. 340 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ జాతీయ రహదారితో లక్నో-ఘజీపూర్ మధ్య ప్రయాణ సమయం ఆరు గంటల నుంచి మూడున్నర గంటలకు తగ్గిపోనుంది. 


సంక్లిష్ట పరిస్థితుల్లో యుద్ధ, రవాణా కార్యకలాపాల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించేలా తీర్చిదిద్దిన ఈ ఎక్స్‌ప్రెస్ హైవేని ప్రధాని ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. పూర్వాంచల్ ప్రజలకు ఈ ఎక్స్‌ప్రెస్ హైవేను అందిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. అభివృద్ధి విషయంలో యూపీపై ఉన్న అపోహలు ఇప్పుడు పటాపంచలు అయ్యాయన్నారు. విమర్శకులు ఒకసారి ఇటువైపు తొంగి చూడాలని చురకలు అంటించారు. 



Updated Date - 2021-11-16T22:20:01+05:30 IST