రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉంది: పురంధేశ్వరి

ABN , First Publish Date - 2021-11-21T16:56:38+05:30 IST

రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ నాయకురాలు పురంధేశ్వరి తెలిపారు. ఆదివారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. రైతులపై దాడులు సరికాదని.. ఈ చర్యలను అందరూ ఖండించాలన్నారు.

రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉంది: పురంధేశ్వరి

విజయవాడ: రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ నాయకురాలు పురంధేశ్వరి తెలిపారు. ఆదివారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. రైతులపై దాడులు సరికాదని.. ఈ చర్యలను అందరూ ఖండించాలన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం రూ.1500 కోట్లు కేటాయించిందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. బీజేపీ సహకరించడం లేదనే మాటలు అవాస్తవమని తెలిపారు. ఏపీకి ఇచ్చే హామీల విషయంలో కేంద్రం ఎక్కడా మడమ తిప్పలేదని, కేంద్రం నిధులతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతుందని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. కాగా.. ఇప్పటికే తాము అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతిస్తున్నామని రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. అంతేకాదు.. అతి త్వరలోనే ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌తో పాటు పలువురు నేతలు ఉద్యమంలో పాల్గొనబోతున్నారు.

Updated Date - 2021-11-21T16:56:38+05:30 IST