అది బీజేపీ కార్యకర్తలందరి సమిష్టి కృషి: పురంధేశ్వరి

ABN , First Publish Date - 2022-03-13T19:12:21+05:30 IST

యూపీ గెలుపు ఒక నాయకుడి విజయం కాదని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అన్నారు.

అది బీజేపీ కార్యకర్తలందరి సమిష్టి కృషి: పురంధేశ్వరి

విశాఖ: ఉత్తరప్రదేశ్ గెలుపు ఒక నాయకుడి విజయం కాదని, అది బీజేపీ కార్యకర్తలందరి సమిష్టి కృషి అని ఆ పార్టీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి అన్నారు. ఆదివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్రాభివృద్ధిపై సీఎం జగన్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఏపీని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లారని పురంధేశ్వరి ఆరోపించారు.


రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే పరిస్థితిలేదని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఉన్న పరిశ్రమలు కూడా వెనక్కివెళ్లిపోతున్నాయని, ఏపీలో రహదారుల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి అభివృద్ధి పనిలో కేంద్రం సాయం ఉందని, జగన్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి శూన్యమని పురంధేశ్వరి పేర్కొన్నారు.

Updated Date - 2022-03-13T19:12:21+05:30 IST