కాంగ్రెస్లో చేరిన Punjabi singer సిద్ధూ మూస్
ABN , First Publish Date - 2021-12-03T16:25:12+05:30 IST
పంజాబీ ప్రముఖ గాయకుడు సిద్ధూ మూస్ వాలా చండీగఢ్లో శుక్రవారం కాంగ్రెస్పార్టీలో చేరారు...
చండీఘడ్ : పంజాబీ ప్రముఖ గాయకుడు సిద్ధూ మూస్ వాలా చండీగఢ్లో శుక్రవారం కాంగ్రెస్పార్టీలో చేరారు.పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబీ రాపర్ సిద్ధూ మూస్ వాలాను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంది.28 ఏళ్ల పంజాబీ గాయకుడైన సిద్ధూ మాన్సా లేదా మౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పంజాబ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పంజాబీ గాయకుడు కాంగ్రెస్ తీర్థం స్వీకరించడం విశేషం.