ఉత్కంఠ భరితమైన పోరులో పంజాబ్ విజయం

ABN , First Publish Date - 2020-10-19T05:48:43+05:30 IST

ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో పంజాబ్ విజయం సాధించింది.

ఉత్కంఠ భరితమైన పోరులో పంజాబ్ విజయం

దుబాయి: ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో ముంబైపై పంజాబ్ విజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో కూడా మ్యాచ్ టై కావడంతో మరో సూపర్ ఓవర్‌కు మ్యాచ్ దారితీసింది. ఇక రెండో సూపర్ ఓవర్‌లో మొదటగా ముంబై బరిలోకి దిగింది. ఒక వికెట్ నష్టానికి 11 పరుగులు తీసి పంజాబ్‌కు 12 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. అయితే పంజాబ్ నుంచి బరిలోకి దిగిన గేల్, మయాంక్ నాలుగు బంతుల్లోనే 15 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించారు. మొదటి బంతికే గేల్ సిక్స్ కొట్టడంతో మ్యాచ్ పంజాబ్ వైపు తిరిగిపోయింది. ఇక ఆ తరువాత మయాంక్ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో రెండు బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ ముంబై ఇచ్చిన లక్ష్యాన్ని చేధించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

Updated Date - 2020-10-19T05:48:43+05:30 IST