పంజాబ్పై సన్ రైజర్స్ ఘన విజయం
ABN , First Publish Date - 2021-04-22T00:34:21+05:30 IST
చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్పై సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది.
చెన్నై: చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్పై సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది. వికెట్ కోల్పోయి 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. బెయిర్ స్టో(63 నాటౌట్), కేన్ విలియమ్సన్(16 నాటౌట్).. ఇద్దరూ నిలకడగా ఆడి 18.4 ఓవర్లలో 121 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో ఫేబియన్ ఆలెన్ ఒక వికెట్ తీసుకున్నాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టు 19.4 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పంజాబ్ బ్యాట్స్మన్లలో మయాంక్(22), షారుఖ్ ఖాన్(22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్ రైజర్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీసుకోగా, అభిషేక్ రెండు, భువీ, రషీద్, సిద్దార్థ్ చెరో వికెట్ తీసుకున్నారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్... కెప్టెన్ వార్నర్(37) వికెట్ కోల్పోయి అలవోకగా విజయం సాధించింది.