విషాదం.. ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

ABN , First Publish Date - 2022-07-21T22:25:17+05:30 IST

పటియాలా: పంజాబ్ పటియాలాలో విషాదకర ఘటన జరిగింది. ధనక్ బస్తీ జాఖాల్ రోడ్‌లో ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.

విషాదం.. ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

పటియాలా: పంజాబ్ పటియాలాలో విషాదకర ఘటన జరిగింది. ధనక్ బస్తీ జాఖాల్ రోడ్‌లో ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను రాజు, సునీత, అమన్, ఉషాగా గుర్తించారు. గాయపడిన 15 ఏళ్ల వికాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వానలకు ఇంటి పైకప్పు కూలడంతో ఈ ఘటన జరిగింది.     


బాధిత కుటుంబం పది నెలలుగా ఈ ఇంట్లో కిరాయికి ఉంటోంది. అంతా నిద్రిస్తున్న సమయంలో ఘటన జరగడంతో తప్పించుకోవడానికి మార్గం లేకుండాపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వికాస్‌ను స్థానికులు అధికారుల సాయంతో పట్రాన్ ఆసుపత్రికి తరలించారు.


నలుగురి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు. సీఆర్‌పీసీ సెక్షన్ 174 ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Updated Date - 2022-07-21T22:25:17+05:30 IST