అదరగొట్టిన చెన్నై బౌలర్లు.. సీజన్లోనే లో స్కోర్ చేసిన పంజాబ్

ABN , First Publish Date - 2021-04-17T02:38:51+05:30 IST

చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అత్యంత దారుణ ప్రదర్శన చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 106 పరుగులు మాత్రమే ..

అదరగొట్టిన చెన్నై బౌలర్లు.. సీజన్లోనే లో స్కోర్ చేసిన పంజాబ్

ముంబై: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అత్యంత దారుణ ప్రదర్శన చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 106 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి పంజాబ్ వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే ఆ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మసూద్ షారూక్ ఖాన్(47: 36 బంతుల్లో. 4 ఫోర్లు, 2 సిక్సులు) జట్టును ఆదుకున్నాడు. షారూక్ తప్ప మరే బ్యాట్స్‌మన్ కూడా కనీస స్కోర్లు కూడా చేయలేకపోయారు. దీంతో ఈ సీజన్లోనే అత్యంత లో స్కోరు చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 4 వికెట్లతో పంజాబ్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఆ తర్వాత శామ్ కర్రాన్, మొయీన్ అలీ, డ్వేన్ బ్రావోలకు తలా ఓ వికెట్ దక్కింది ఇక కొద్ది సేపట్లో 107 పరుగుల లక్ష్యంతో చెన్నై బరిలోకి దిగనుంది.

Updated Date - 2021-04-17T02:38:51+05:30 IST