పంజాబ్ భారీ స్కోరు.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..

ABN , First Publish Date - 2021-04-13T03:06:46+05:30 IST

ఐపీఎల్ 2021లో పంజాబ్ కింగ్స్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. తొలి మ్యాచ్‌లోనే భారీ స్కోరుతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. దీంతో టోర్నీలోనే తొలిసారి 200కు పైగా స్కోరు చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. పంజాబ్ కెప్టెన్..

పంజాబ్ భారీ స్కోరు.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..

చెన్నై: ఐపీఎల్ 2021లో పంజాబ్ కింగ్స్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. తొలి మ్యాచ్‌లోనే భారీ స్కోరుతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. దీంతో టోర్నీలోనే తొలిసారి 200కు పైగా స్కోరు చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్(91: 50 బంతుల్లో.. 7 ఫోర్లు, 5 సిక్సులు) అదరగొట్టాడు. అతడికి క్రిస్ గేల్(40: 28 బంతుల్లో.. 4 ఫోర్లు, 2 సిక్సులు)లకు తోడు దీపక్ హుడా(64: 28 బంతుల్లో.. 4 ఫోర్లు, 6 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో పంజాబ్ స్కోరు బోర్డు మ్యాచ్ ప్రారంభం నుంచే పరుగులు పెట్టింది. రాజస్థాన్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ రాహుల్, హుడాలు బౌండరీల వర్షం కురిపించారు. వీరి విజృంభణతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. కాగా.. మరికొద్ది సేపట్లో 222 పరుగుల లక్ష్యంతో రాజస్థాన్ రాయల్స్ బరిలోకి దిగనుంది. మరి బలమైన బ్యాటింగ్ లైనప్‌తో ఉన్న రాజస్థాన్ ఇంత పెద్ద టార్గెట్‌‌ను ఛేజ్ చేస్తుందేమో చూడాలి.

Updated Date - 2021-04-13T03:06:46+05:30 IST