ప్రధానమంత్రిని కలిసిన పంజాబ్ సీఎం

ABN , First Publish Date - 2021-10-02T00:10:29+05:30 IST

ప్రధానితో సమావేశం అనంతరం మీడియాతో సీఎం చన్నీ మాట్లాడుతూ ‘‘రైతులతో సంప్రదింపులు జరిపి ఆందోళన పరిష్కరించాల్సిందిగా ప్రధానమంత్రిని కోరాను. అలాగే కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేశాను..

ప్రధానమంత్రిని కలిసిన పంజాబ్ సీఎం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కలుసుకున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో శుక్రవారం వీరి కలయికకు వేదికైంది. తాను ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి ప్రధానిని కలుస్తున్నందుకు గుర్తుగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయ జ్ణాపికను ప్రధానికి చన్నీ అందజేశారు. అనంతరం వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళన సహా పంజాబ్‌కు సంబంధించిన ఇతర అంశాలపై చర్చించినట్లు సీఎం చన్నీ పేర్కొన్నారు.


ప్రధానితో సమావేశం అనంతరం మీడియాతో సీఎం చన్నీ మాట్లాడుతూ ‘‘రైతులతో సంప్రదింపులు జరిపి ఆందోళన పరిష్కరించాల్సిందిగా ప్రధానమంత్రిని కోరాను. అలాగే కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేశాను. అలాగే కోవిడ్ మహమ్మారి కారణంగా మూసేసిన కర్తార్‌పూర్ కారిడాన్‌ను మళ్లీ తెరవాలని విజ్ణప్తి చేశాను’’ అని అన్నారు.

Updated Date - 2021-10-02T00:10:29+05:30 IST