మందు వేయకుండా ఆయన మాట్లాడరు: చన్నీ

ABN , First Publish Date - 2022-02-07T00:22:39+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్‌పై పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ విమర్శలు..

మందు వేయకుండా ఆయన మాట్లాడరు: చన్నీ

లూథియానా: ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్‌పై పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ విమర్శలు గుప్పించారు. మందు వేయకుండా ఆయన ప్రసంగించలేరని అన్నారు. పంజాబ్‌లో ఆప్ ఎలాంటి మార్పు తీసుకురాలేదని పేర్కొన్నారు. ''కెప్టెన్ (అమరీందర్ సింగ్) మధ్యాహ్నం 4 గంటలకు దుకాణం మూసేస్తారు. భగవంత్ సింగ్ మాన్ ఆ పని సాయంత్రం 6 గంటలకు చేస్తారు. ఆయన మందు వేయకుండా మాట్లాడరు'' అని చన్నీ అన్నారు. పంజాబ్‌ను లూటీ చేయడానికే ఆప్ అడుగుపెట్టిందని విమర్శించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వమంటూ కేజ్రీవాల్ అడుగుతున్నారని, వాళ్లవన్నీ అబద్ధాలేనని విమర్శించారు.


''విద్యుత్ బిల్లులు దేశంలోనే పంజాబ్‌లో అతి తక్కువ. వాటర్ బిల్లులు రద్దు చేశాం. పెట్రోల్, డీజిల్ రూ.10 తక్కువ. ఇది ప్రజల ప్రభుత్వం. నేను ఒకటే చెబుతున్నారు. మీరు కెప్టెన్‌ను, బాదల్స్‌ను చూశారు. మాకో అవకాశం ఇవ్వండి'' అని చన్నీ కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ తనపై చేసిన ఆరోపణలపై చన్నీ స్పందిస్తూ, తాను చాలా ఎన్నికల్లో పోటీ చేశానని, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నానని, ఒక్కరు కూడా తాను తప్పుచేశానని వేలెత్తి చూపలేదని చెప్పారు. అక్రమ మార్గాల ద్వారా తాను ఒక్క 'పెన్నీ' కూడా సంపాదించింది లేదని పేర్కొన్నారు.

Updated Date - 2022-02-07T00:22:39+05:30 IST