అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో Punjab Cm మేనల్లుడి ఇంటిపై ఈడీ దాడి

ABN , First Publish Date - 2022-01-18T16:46:32+05:30 IST

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీ...

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో Punjab Cm మేనల్లుడి ఇంటిపై ఈడీ దాడి

చండీఘడ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీ ఇంటితోపాటు పంజాబ్ రాష్ట్రంలోని మరో పది ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు మంగళవారం దాడులు చేశారు.పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం మేనల్లుడి ఇంటిపై ఈడీ అధికారులు దాడి చేయడం సంచలనం రేపింది. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఈడీ సీఎం మేనల్లుడిపై కేసు నమోదు చేసింది.పంజాబ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 20వతేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈడీ దాడులు జరిపింది. కేంద్రప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో దెబ్బతీసేందుకే సీఎం మేనల్లుడి ఇంటిపై ఈడీ బృందాలను పంపించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.


Updated Date - 2022-01-18T16:46:32+05:30 IST